రైతు ప్రాణాలు బలి తీసుకుంటున్న వరి కొయ్యలు.. 5 రోజుల్లో ఇద్దరు రైతుల మృతి! ఏం జరిగిందంటే?
సిద్దిపేట, జూన్ 4: పసిడి పంటలు పండించే అన్నదాతను దురదృష్టం వెంటాడుతోంది. పొలాన్ని శుభ్రం చేద్దామనుకున్న రైతుల ప్రాణాలను వరికొయ్యలే బలితీసుకుంటున్నాయి. ఐదు రోజుల వ్యవధిలోనే సిద్దిపేట జిల్లాలో ఇద్దరు రైతులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వరి కోతల తర్వాత మిగిలిన కొయ్యలను తగలబెట్టే క్రమంలో ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. ఈరోజు మిరుదొడ్డి మండల కేంద్రంలో వరి కొయ్యలు తగలబెడుతూ ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని మద్దెల మల్లయ్య అనే రైతు మృతి…
