Andhra Pradesh: రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత
కర్నూలు జిల్లా గోనెగండ్లలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పొలం భూ సర్వేలో రెవెన్యూ అధికారుల ఏకపక్ష వైఖరి, అన్యాయంపై మనస్థాపం చెంది ఈరమ్మ (77) అనే వృద్ధురాలు ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచింది. అధికారుల నిర్లక్ష్యం, అవతలి వ్యక్తులకు కొమ్ముకాయడం వల్లే తమకు అన్యాయం జరిగిందని, ఆ మనస్తాపంతోనే ఆమె ప్రాణాలు…
