తిరుపతిలో దారుణం.. నడిరోడ్డుపై డబుల్ మర్డర్ కలకలం..మహిళే సూత్రధారి?
టెంపుల్ సిటీ తిరుపతిలో గురువారం ఒక్కసారిగా కలకలం రేగింది. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్, శ్రీ పద్మావతి కళ్యాణ మండపాల వద్ద పగటిపూటే నడిరోడ్డుపై ప్రత్యర్థులు విచక్షణారహితంగా దాడి చేసి ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు. మృతులను జీవకోనకు చెందిన మునిరత్నం (50), మణికంఠగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. అప్పటికే అక్కడ కాపు కాసిన ప్రత్యర్థులు, రెండు బైక్లపై వీరిని వెంబడించారు. లక్ష్మీపురం సర్కిల్…
