ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 'పంజా'ను రీ రిలీజ్ చేశారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ… రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున థియేటర్లలో ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను రీ రిలీజ్ చేశారు.
కాగా 2011లో రిలీజ్ అయిన పంజా అప్పుడు థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ కాల క్రమేణా ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు అయితే ఈ సినిమాను రిపీట్ మోడ్ లో చూస్తారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 02) ను పురస్కరించుకుని పంజా సినిమాను మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. చాలా మంది పవన్ అభిమానులు థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను వీక్షించి ఎంజాయ్ చేశారు.
కోలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒకరు అంజలి లవానియా కాగా మరొకరు సారా జేన్ డయస్. ఈ క్రమంలో పంజా రీ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ అంజలి లవానియా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది
'జై + జాహ్నవి… ఒకవేళ వీరిద్దరూ పారలల్ యూనివర్స్లోనైనా కలిసిపోయి ఉంటే ఎంత బాగుంటుందో కదా! సెప్టెంబర్ 2న రీ రిలీజ్ అవుతోన్న 'పంజా'ను అసలు మిస్ అవ్వకండి. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారు… మీరు ఎప్పటికీ నా బెస్ట్'
'నా హృదయంలో 'పంజా' సినిమాకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారితో పాటు దర్శకుడు విష్ణు వర్ధన్తో కలిసి పని చేసే అవకాశం రావడం పట్ల నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను' అని రాసుకొచ్చింది అంజలి. ప్రస్తుతం ఈ హీరోయిన్ పోస్ట్, ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.






