విప్రోలో వింత.. కంపెనీ ఛైర్మన్ కంటే CEOకు 7 రెట్లు జీతం ఎక్కువ! ఒక్క ఏడాదిలోనే..
దేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ పల్లియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.49.6 కోట్ల జీతం అందుకున్నట్లు కంపెనీ తాజా వార్షిక నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆయనకు రూ.53.6 కోట్ల వేతన ప్యాకేజీ లభించగా, ఈ ఏడాది ఆ మొత్తం కొంత తగ్గింది. పర్ఫార్మెన్స్-లింక్డ్ కాంపెన్సేషన్లో కోత విధించడం వల్లే ఈ తగ్గుదల చోటుచేసుకున్నట్లు సంస్థ పేర్కొంది. వేతనం తగ్గినప్పటికీ, విప్రోలో అత్యధిక పారితోషికం అందుకున్న…
