తాజావార్తలు
కొత్త చరిత్ర.. చైనాను దాటేసి వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్‌! ప్రపంచానికి అన్నపూర్ణగా..

కొత్త చరిత్ర.. చైనాను దాటేసి వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్‌! ప్రపంచానికి అన్నపూర్ణగా..

భారతదేశం వ్యవసాయంలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. జనవరి 4న భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ప్రకటించారు. ఈ విషయంలో భారతదేశం చైనాను అధిగమించింది. దేశం మొత్తం వరి ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులకు చేరుకోగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది దేశానికి లభించిన అపూర్వ విజయంగా వ్యవసాయ మంత్రి అభివర్ణించారు. భారత్‌ ఒకప్పుడు ఆహార కొరత ఉన్న దేశంగా…

Read More
వెనిజులా సంక్షోభం.. భారత కంపెనీలకు తప్పని టెన్షన్.. ఎందుకంటే..?

వెనిజులా సంక్షోభం.. భారత కంపెనీలకు తప్పని టెన్షన్.. ఎందుకంటే..?

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా పేరుగాంచిన వెనిజులా.. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. ఆ అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అమెరికా సైన్యం బంధించిన తర్వాత పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఇప్పటికే భారత్ భారీ పెట్టుబడులు పెట్టింది. కేవలం చమురుకే పరిమితం కాకుండా.. మెటల్స్, ఫార్మా వంటి కీలక రంగాల్లోనూ భారతీయ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఆయిల్ – గ్యాస్ భారతదేశ ఇంధన…

Read More
Video: లగ్జరీ విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ఇంటీరియర్‌! పరిశీలించిన కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

Video: లగ్జరీ విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ఇంటీరియర్‌! పరిశీలించిన కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ పట్టాలెక్కింది. భారతీయ రైల్వేల్లో కొత్త యుగానికి నాంది పలుకుతూ ఈ సూపర్‌ ట్రైన్‌ పరుగులు పెట్టనుంది. ఈ ప్రత్యేక రైలును తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రైల్వే స్టేషన్‌లో పరిశీలించారు. ఇంజన్‌తో పాటు ఇంటీరియర్‌ను ప్రత్యేకంగా సందర్శించారు. Middle & low-income families की next-generation सवारी… 🚆Vande Bharat Sleeper pic.twitter.com/kTDXxW2k85 — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 3, 2026 మంత్రి ట్రైన్‌ను…

Read More
Telangana: వణుకు పుట్టించే న్యూస్.. మరోసారి పంజా విసరనున్న చలి.. ఈ రోజుల్లో జాగ్రత్త..

Telangana: వణుకు పుట్టించే న్యూస్.. మరోసారి పంజా విసరనున్న చలి.. ఈ రోజుల్లో జాగ్రత్త..

గత కొద్ది రోజులుగా చలి నుంచి స్వల్ప ఉపశమనం పొందుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. డిసెంబర్‌లో వణికించిన చలి తీవ్రత మళ్లీ మొదలుకానుంది. జనవరి 5 నుంచి 12 వరకు రెండో విడత శీతల గాలులు బలంగా వీయనున్నాయని హెచ్చరించారు. రానున్న వారం రోజుల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. డిసెంబర్ నెలలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలకు సమానంగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. సాధారణంగా ఎండ ప్రభావం ఉండే…

Read More
బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ కారణాలతో మళ్లీ భారీగా పెరగనున్న గోల్డ్ ధరలు..

బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ కారణాలతో మళ్లీ భారీగా పెరగనున్న గోల్డ్ ధరలు..

ప్రపంచ రాజకీయ యవనికపై అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వెనిజులాపై అమెరికా సైనిక దాడుల తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ అనిశ్చితి మధ్య పెట్టుబడిదారులు మళ్లీ సురక్షిత స్వర్గంగా భావించే బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. 2025లో ఏకంగా 70శాతం లాభాలను పంచిన పసిడి, 1979 తర్వాత అత్యుత్తమ వార్షిక పనితీరును కనబరిచింది. ఇప్పుడు 2026 ప్రారంభంలో కూడా అదే జోరు కనిపిస్తోంది. ఈ సోమవారం బంగారం ధరలను ప్రభావితం చేసే 5…

Read More
మంచి క్రెడిట్‌ కార్డు పొందాలంటే ఏం కావాలి? ఎలాంటి ఇన్‌కమ్‌ సోర్స్‌ చూపించాలి?

మంచి క్రెడిట్‌ కార్డు పొందాలంటే ఏం కావాలి? ఎలాంటి ఇన్‌కమ్‌ సోర్స్‌ చూపించాలి?

నేడు క్రెడిట్ కార్డులు ఉద్యోగస్థులకే పరిమితం కాలేదు. భారతదేశంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు విద్యార్థులు, గృహిణులు, ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపార యజమానులు కూడా జీతం స్లిప్‌లు లేదా ఆదాయ రుజువు లేకుండా క్రెడిట్ కార్డులను పొందవచ్చు, వారు సరైన దశలను అనుసరించాలి. మీకు రెగ్యులర్ ఆదాయం నమోదు కాకపోతే, FDపై క్రెడిట్ కార్డ్ పొందడం అత్యంత సురక్షితమైన, సులభమైన ఎంపికగా పరిగణించబడుతుంది. HDFC, ICICI, SBI, IDFC ఫస్ట్ వంటి బ్యాంకులు…

Read More
Geyser Tips: స్నానం చేసేటప్పుడు గీజర్ ఆన్‌లో ఉంచడం సరైందేనా? ఇది తప్పక తెలుసుకోండి!

Geyser Tips: స్నానం చేసేటప్పుడు గీజర్ ఆన్‌లో ఉంచడం సరైందేనా? ఇది తప్పక తెలుసుకోండి!

Geyser Tips: చాలా మంది ఇళ్లల్లో గీజన్‌ ఉంటుంది. ఈ సీజన్‌లో చలి కారణంగా ఈ గీజన్‌లను ఎక్కువగా వాడుతుంటారు. అయితే స్నానం చేసేటప్పుడు గీజర్‌ను ఆన్‌లోనే ఉంచాలా? లేక ఆఫ్‌ చేయాలా? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. మరి స్నానం చేస్తున్నప్పుడు గీజర్‌ ఆన్‌లో ఉంటే ఏమవుతుందో తెలుసుకుందాం.. చాలా మంది శీతాకాలంలో స్నానం చేసేటప్పుడు గీజర్‌ను ఆన్‌లో ఉంచుతారు. ఇది ఒక అలవాటుగా మారుతుంది. కానీ దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి…

Read More
అరే.. ఈ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌కు ఏమైంది? పూనకంతో ఊగిపోతూ.. భక్తులను కొరికేస్తూ.. షాకింగ్ వీడియో వైరల్

అరే.. ఈ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌కు ఏమైంది? పూనకంతో ఊగిపోతూ.. భక్తులను కొరికేస్తూ.. షాకింగ్ వీడియో వైరల్

సుధా చంద్రన్.. ఇప్పటి జనరేషన్ కు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ 1990 జనరేషన్ కు ఈమె గురించి బాగానే పరిచయం ఉంటుంది. తెలుగుతో పాటు హిందీ సినిమాలు, సీరియల్స్ తో నటించారీ అందాల తార. ఒక రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆమె తన క్లాసికల్ డ్యాన్సర్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఆమె జీవిత కథ ఆధారంగా మయూరి అనే సినిమా కూడా వచ్చింది. ఇందులో ఆమెనే స్వయంగా నటించి…

Read More
Hyderabad: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనర్‌ ప్రత్యేక విజ్ఞప్తి

Hyderabad: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనర్‌ ప్రత్యేక విజ్ఞప్తి

V.C. Sajjanar, IPS (Hyderabad CP) సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారు.. వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా నగరవాసులను అప్రమత్తం చేశారు. పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తుంటారని,…

Read More
చనిపోయిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం.. కోడలిని చంపిన అత్త!

చనిపోయిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం.. కోడలిని చంపిన అత్త!

Woman Killed Daughter In Law In MaharashtraImage Credit source: AI generated Image థానే, జనవరి 4: మరణించిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ తల్లి దారుణానికి పాల్పడింది. మరో వ్యక్తితో కలిసి కోడలిని హత్య చేసింది. అనంతరం కోడలి మృతదేహాన్ని ఒకచోట పడేసి.. ఏం తెలియనట్లు కోడలు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అసలు గుట్టు రట్టు చేయడంతో అత్తతో పాటు ఆమెకు…

Read More