తెలంగాణకు గుండెలాంటి సింగరేణి అక్రమాల పుట్టగా మార్చారు.. సీబీఐ విచారణ జరపాల్సిందేః కిషన్ రెడ్డి
తెలంగాణకు గుండెలాంటి సింగరేణి.. ఇప్పుడు అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి అక్రమాలపై CBI దర్యాప్తు జరగాల్సిందేనన్న ఆయన, సీబీఐ విచారణపై రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందన్నారు. మంత్రుల మధ్య వాటాల వివాదంతోనే సింగరేణి అంశం వెలుగులోకి వచ్చిందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కేంద్రం ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ను కేటాయించిందని గుర్తించారు. ఈమేరకు కోల్ బ్లాక్కు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని…
