Viral Video: ఎంతకు తెగించార్రా.. రీల్స్ పిచ్చితో ప్రాణాలు తీస్తారా.. వందే భారత్ ట్రైన్కు అడ్డంగా..
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైక్స్ కోసం కొందరు ఎంతటి తెగింపుకైనా వెళ్తున్నారు. కొందరు యువకులు కేవలం ఒక వీడియో కోసం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టారు. దేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఆపి, వారు చేసిన నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొందరు యువకులు రైల్వే పట్టాలపై పెద్ద పెద్ద చెక్క దుంగలను ఉంచారు. అంతటి వేగంతో వచ్చే…
