Andhra Pradesh: ఏపీ రైతులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. 24 గంటల్లో అకౌంట్లోకి డబ్బులు..
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రబీ ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేసింది. ధాన్య సేకరణ ప్రారంభించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తయిందని, కొన్నిచోట్ల సాగు ఆలస్యమైనా రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. అదే ఉత్సాహంతో రబీ సీజన్ ధాన్యం సేకరణ చేపడుతున్నామని, ఇప్పటికే సేకరించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఎలాంటి అక్రమాలు, పొరపాట్లకు తావు లేకుండా రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుంటామని స్పష్టం…
