లక్కీ డ్రాలో కాంగ్రెస్ లక్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
జనగామ మరియు తొర్రూరు మున్సిపాలిటీలలో ఛైర్పర్సన్ పదవుల ఎన్నిక తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిసింది. ఇరు పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో లక్కీ డ్రా నిర్వహించగా, కాంగ్రెస్ అభ్యర్థులకు అదృష్టం వరించింది. జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి, తొర్రూరులో శ్రావణ్ లక్కీ డ్రా ద్వారా ఛైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. ఈ విజయం తర్వాత బాలమణి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో మున్సిపల్ హాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తొర్రూరులోనూ లక్కీ డ్రా…
