అయ్యో మణితేజ్.. చిన్న కాటే ప్రాణాలు తీసింది.. రూ.70 లక్షలు ఖర్చుపెట్టినా..
జగిత్యాల కోటిలింగాల గ్రామానికి చెందిన మణితేజ్ను 2024 డిసెంబర్ 26న ఒక కుక్క కరిచింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలుడిని సమీప ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మొదట్లో పెద్దగా ప్రమాదం లేదని భావించిన కుటుంబానికి.. కొద్ది రోజుల తరువాత బాలుడి ఆరోగ్యం క్షీణించడం ఆందోళన కలిగించింది. అనారోగ్య లక్షణాలు కనిపించడంతో బాలుడిని మళ్లీ వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. రేబీస్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు…
