అమ్మ బాబోయ్.. మూడు రోజుల వ్యవధిలో 11 మంది.. బిక్కుబిక్కుమంటున్న యూనివర్సిటీ విద్యార్థులు..!
ఎంతోమంది గొప్ప మేధావులు.. విద్యావేత్తలను ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వవిద్యాలయం ఇది. తెలంగాణకు తలమానికంగా నిలిచిన వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు నిత్యం వివాదాల సుడిగుండంలో విమర్శలు మూట కట్టుకుంటుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు మారింది. వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ఎలుకలు షేక్ చేస్తున్నాయి. విద్యార్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హాస్టల్స్ బయట కుక్కలు.. గదుల్లో ఎలుకలు చొరబడి రక్కి గాయపరుస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో 11 మంది విద్యార్థినులు…
