Samatha Kumbh 2026: సాకేత రాముని సేవలో మైహోం గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు
ప్రతీరోజూ సుప్రభాత సేవతో మొదలయ్యే కార్యక్రమాల్లో.. అష్టాక్షరీ మంత్రజపం, ఆరాధన, సేవాకాలం, నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, శాత్తుముఱై, తీర్థప్రసాద గోష్టి, బలిహరణ నిత్యం ఉంటాయి. మూడవ రోజు ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. మాఘమాస పూర్ణిమ సందర్భంగా భక్తులకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రవచనం చేశారు. ఈ పూర్ణిమ అత్యంత పవిత్రమైనది, విశేష ప్రభావం కలిగినదని స్వామి తెలిపారు. గరుడ సేవలో వేంచేసిన 18 మంది పెరుమాళ్లకి సామూహిక తిరుమంజన సేవలు నిర్వహించారు….
