పెట్రోల్ బైకులు బ్యాన్..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం!
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ వాహనాలకు త్వరలో గుడ్బై చెప్పే పరిస్థితి ఏర్పడనుంది. ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన కొత్త డ్రాఫ్ట్ ఈవీ పాలసీ 2026-30 ఆటోమొబైల్ రంగంలో పెద్ద మార్పులకు దారితీయనున్నట్లు కనిపిస్తోంది. ఈ ముసాయిదా ప్రకారం, పెట్రోల్తో నడిచే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను దశలవారీగా నిలిపివేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రణాళికలో భాగంగా 2027 జనవరి నుంచి కొత్త పెట్రోల్ త్రీ-వీలర్ల రిజిస్ట్రేషన్ను నిలిపివేయాలని, 2028 ఏప్రిల్ నుంచి ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్పై పూర్తి నిషేధాన్ని…
