దేశంలో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. జూన్లో వర్షపాతం 40 శాతం లోటు నమోదు కాగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జూలై నెల అంచనాలతో రైతులను మరింత ఆందోళనకు గురిచేసింది. జూలైలోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని ఐఎండీ తెలిపింది.పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో ప్రభావం భారత రుతుపవనాలను తీవ్రంగా మందగింపజేస్తోంది. దీనివల్ల వర్షపు మేఘాలు బలహీనపడి, దారి మళ్లుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయ రంగంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఖరీఫ్ సాగుకు వర్షాలే ఆధారం. పంటల సాగు నిలిచిపోవడంతో ఆహార సంక్షోభం, ద్రవ్యోల్బణం ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో, వ్యవసాయ శాఖ నీటి పొదుపు పద్ధతులు, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ఎంచుకోవాలని సూచించింది. అయితే, జూలై మొదటి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, ఈశాన్య, వాయువ్య, మధ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ కొద్దిపాటి ఆశను రేపింది. తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం :
