Telangana: విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు.. ఫ్రీగా భోజనం..
తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో రూ.3,24,234 కోట్ల భారీ అంచనాతో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో, సామాజిక, ఆర్థిక న్యాయమే లక్ష్యంగా ఈ బడ్జెట్ను రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ పలు విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించారు. ప్రభుత్వం ఈసారి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ.26,674 కోట్లను కేటాయించింది. అంతేకాకుండా విద్యార్థుల సంక్షేమం…
