Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు ఈ సేవలు బంద్..
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ తెప్పొత్సవాల నిర్వహణకు ఇప్పటినుంచే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఘనంగా వీటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ తెప్పోత్సవాల్లో భాగంగా పుష్కరిణిలో స్వామివారు విహరిస్తూ దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక సూచనలు జారీ చేసింది. పలు సేవలను రద్దు…
