అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
ఎన్నికల్లో గెలుపోటములు సహజం, కానీ ఓడిపోయామన్న కసితో ఓటర్లపై దాడులకు దిగడం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. భువనగిరి మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రజాస్వామ్యానికే మచ్చగా నిలుస్తోంది. భువనగిరి మున్సిపాలిటీ 1వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పలబోజు స్వరూపరాణి, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు హాట్ బాక్సులు, చీరలను పంపిణీ చేశారు. అయితే, ఫలితాల్లో ఆమె బిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని స్వరూపరాణి కుటుంబ సభ్యులు,…
