Andhra Pradesh: ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. నిధులు వచ్చేశాయ్..
ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు భారీ గుడ్ న్యూస్ అందింది. కేంద్రం కూలీలకు చెల్లించేందుకు నిధులను విడుదల చేసింది. ఏపీలోని కూలీలకు ఇచ్చేందుకు రూ.1805 కోట్లు తాజాగా రిలీజ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడం కోసం వీటిని విడుదల చేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఉపాధి హామీ పథకం కూలీలకు అర్ధిక భరోసాను అందించేందుకు కేంద్రం నిధులు విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు….
