స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ పదవీకాలాన్ని మరోసారి పొడిగించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్కు సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్కు సంబంధించిన స్టాట్యూటరీ విధులు, బాధ్యతలు, తదుపరి చర్యలు పూర్తి చేసేందుకు ఈ పొడిగింపు ఇచ్చినట్లు ప్రభుత్వం…
