AP Inter Supply Exams 2026: ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులకు గుడ్న్యూస్.. ఇంప్రూవ్మెంట్ రాసేందుకు సర్కార్ గ్రీన్సిగ్నల్!
అమరావతి, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకూ పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఇంటర్ విద్యార్థులకు మే నెలలో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ‘ఇంప్రూవ్మెంట్’కు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర హిస్టరీలోనే మొదటిసారిగా ద్వితీయ సంవత్సరంలోనూ ‘బెటర్మెంట్’కు అనుమతి ఇచ్చినట్లైంది. మార్చి 2026 పరీక్షల్లో పాస్ లేదా ఫెయిల్ అయిన సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చని తన ప్రకటనలో విద్యాశాఖ స్పష్టం చేసింది. సబ్జెక్టుల వారీగా ‘బెస్ట్ మార్క్స్’…
