Erode: గ్లోబల్ టర్మరిక్ క్యాపిటల్ మాత్రమే కాదు.. ఈరోడ్ పర్యాటకుల స్వర్గధామం, ఇదే బెస్ట్ ట్రావెల్ టైమ్
భారతదేశంలో పసుపు ఎక్కువగా పండుతుందని అందరికీ తెలిసిందే. అయితే, ప్రపంచ పసుపు రాజధాని కూడా మన దేశంలోనే ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అదే, తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్. ఈ నగరానికి ప్రపంచపు పసుపు రాజధాని అనే పేరుంది. ఇంకా మంజల్ మానగరం, పసుపు నగరం అని కూడా పిలుస్తారు. ఈ నగరం ప్రపంచంలోని అత్యుత్తమ పసుపును ఉత్పత్తి చేస్తుంది. వంట గది నుంచి ప్రపంచ సౌందర్య ఉత్పత్తుల వరకు ఇక్కడి పసుపు ప్రయాణం చేస్తుంది….
