నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో భానుడి భగభగలకు మూగజీవాలు అల్లాడిపోయాయి. ఎండ తీవ్రతకు తాళలేక, దాహం తీర్చుకునేందుకు ఏకంగా ఓ కోతి ప్రయాణికులతో వెళ్తున్న బస్సును అడ్డుకున్న ఘటన యవత్మాల్ జిల్లాలో జరిగింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వాషిమ్ నుంచి పుసాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఖండాలా ఘాట్ సమీపంలోకి రాగానే.. ఓ కోతి హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చి బస్సుకు అడ్డుగా నిలబడింది. డ్రైవర్, ప్రయాణికులు ఎంత అదిలించినా అది పక్కకు తప్పుకోలేదు. ఆ మూగజీవి…
