Telangana: అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల సామాన్యులనే కాదు అన్నదాతలు కూడా ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరగడంతో యాసంగి సాగుపై కోలుకోలేని దెబ్బ పడుతోంది. ప్రధానంగా వరి నారుమళ్లు ఎదగడం లేదు. చాలా చోట్ల అవి పసుపు రంగులోకి మారి ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల వరి నారుమళ్ళు పెరిగడం లేదు. దీంతో రైతులు మళ్లీ నారుమళ్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది….
