కొండంతా గోవింద నామస్మరణ.. తిరుమలలో భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్లు
ఈ ఏడాది వేసవిలో ఎండలే కాదు తిరుమల కొండ కూడా కిటకిటలాడు తోంది. శ్రీవారి భక్తులతో కిక్కిరిసిపోతున్న తిరుమలలో టీటీడీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయాలతో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్న టిటిడి మెరుగైన సేవలు అందిస్తోంది. తిరుమల కలియుగ వైకుంఠం. శ్రీవారిని దర్శించు కునేందుకు నిత్యం కొండకు చేరే భక్తులతో కిటకిటిలాడే ప్రాంతం. ఇలా ఎప్పుడూ కొండ నిండా జనం…
