గ్రహణ సమయంలో తెరిచి ఉండే వైష్ణవ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా…?
మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక నియమాలు అమలు చేయనున్నారు. సాధారణంగా గ్రహణం ప్రారంభానికి ముందు ఆలయాలు మూసివేసి, గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయం మార్చి 3న ఉదయం 6.30 గంటల లోపు ప్రాతఃకాల అర్చనలు పూర్తి చేసి ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ఆలయాన్ని…
