గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం..
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రైల్వేగేట్ సమీపంలో కాల్పుల కలకలం రేగింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో, రైల్వే ట్రాక్ వెంట కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గస్తీలో ఉన్న పోలీసులు గమనించారు. సదరు వ్యక్తుల చేతుల్లో కట్టర్లు , ఇతర ఆయుధాలు ఉండటంతో, వారు దోపిడీకి ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నించగా, వారు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు గాల్లోకి 10 రౌండ్ల కాల్పులు…
