పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
అమెరికా కాలిఫోర్నియాలో విజయనగరం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి విషాదంగా మారింది. పుట్టినరోజే కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి సింగిరెడ్డి సాయిశ్రీ హరికృష్ణ (26) మృతి విషాదాన్ని మిగిల్చింది. చిన్ననాటి నుంచి ఈతపై మక్కువ కలిగిన హరికృష్ణ, అమెరికాలో కూడా అదే ఆసక్తితో నదిలో ఈదేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన హరికృష్ణ 2023లో ఎంఎస్ చదవడానికి అమెరికాకు…
