పహల్గామ్ మారణకాండ.. ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరు డాక్టర్ వీరోచిత పోరాటం!
జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సంతోషంగా విహారయాత్రకు వెళ్లిన ఒక కుటుంబం ఉగ్రవాదుల పాశవిక దాడితో ఛిన్నాభిన్నమైంది. బెంగళూరుకు చెందిన డాక్టర్ సుజాత కథ వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. 2025 ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో సుజాత భర్త భరత్ భూషణ్ బలయ్యారు. ఆధార్ కార్డులను తనిఖీ చేసి, మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తన బిడ్డను వదిలేయమని భరత్ ప్రాధేయపడినా కనికరించకుండా…
