JEE Advanced 2026 Notification: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే?
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ వెల్లడైంది. నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు వహిస్తున్న ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షల షెడ్యూల్తోపాటు, సిలబస్ను కూడా నోటిఫికేషన్లో వెల్లడించింది. జేఈఈ మెయిన్స్లో కనీస ర్యాంకులు…
