చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో.. ఉరేసుకున్న టెకీ
జ్యోతిష్యంపై మితిమీరిన నమ్మకంతో ఓ యువతి సూసైడ్ చేసుకున్న విషాదకర ఘటన బెంగళూరులో జరిగింది. సమాజం సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్తున్నా, మూఢనమ్మకాలు ఇంకా విద్యావంతులను సైతం బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా సమాజంపై కనీస అవగాహన ఉన్నప్పటికీ, జ్యోతిష్యుడి మాటలకు భయపడి ఆ యువతి తనువు చాలించడం అందరినీ కలిచివేస్తోంది. బెంగళూరులోని బాగలకుంటె ఎంఈఐ లేఔట్కు చెందిన విద్యాజ్యోతి (29) ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల…
