తాజావార్తలు

Ireland vs India 2nd T20: ఘోర పరాభవం.. ఐర్లాండ్ చేతిలో రెండో టీ20లోనూ టీమిండియా ఓటమి

Ireland vs India 2nd T20: ఘోర పరాభవం.. ఐర్లాండ్ చేతిలో రెండో టీ20లోనూ టీమిండియా ఓటమి


ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్‌కు గురైంది. భారత క్రికెట్ చరిత్రలో ఇది ఘోర పరాభవంగా చెప్పుకోవచ్చు. టీ20 క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న టీమిండియా.. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడిన తొలి సిరీస్, అందులోనూ పసికూన ఐర్లాండ్ చేతిలో రెండు వరుస మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయింది. ఆదివారం రాత్రి బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.

ఇక ఛేజింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఐర్లాండ్ బౌలర్ జై మూంద్రా ఊహించని షాక్ ఇచ్చాడు. ఇద్దరు భారత ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత టీమిండియా ఏ దశలోనూ కోలుకోలేదు. వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. మధ్యలో వర్షం అంతరాయం కలిగించినా.. డక్ వర్త్ లూయిస్‌ ప్రకారం కూడా వెనుకబడే ఉంది. వర్షం ఆగి మ్యాచ్ ప్రారంభం కావడంతో ఓటమి తప్పించుకోవచ్చు అని అనుకున్నా.. ఐర్లాండ్ అద్భుత బౌలింగ్ ముందు టీమిండియా బ్యాటర్లు చేతులు ఎత్తేశారు. మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించినా.. టీమిండియాను గెలిపించలేకపోయాడు. మొత్తంగా టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *