బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.. ఇరాన్-అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, డాలర్, రూపాయి విలువ మారకం ప్రభావంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. సోమవారం ఒక్కరోజే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.180 మేర ధర పెరిగింది. పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ఆధారంగా మంగళవారం (జులై 21) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,43,470 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,31,510 గా ఉంది.
వెండి కిలో ధరపై రూ.100 మేర పెరిగి.. రూ.2,35,100 గా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
