జమ్ముకశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవేట.. గుహలో నక్కిన టెర్రరిస్టులు హతం..!
జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఉద్దంపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉద్దంపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో గత రెండు రోజుల నుంచి భద్రతా బలగాలు కూంబింగ్ను చేపట్టాయి. నలుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఆశ్రయం తీసుకున్నట్టు సమాచారం అందింది. పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. రాంపూర్ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు…
