అంతకుముందు అమ్రోహాకే చెందిన 11వ క్లాస్ విద్యార్థిని అహానా కూడా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల చనిపోయింది. అహానాకి జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. తరచుగా స్థానిక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఆర్డర్ చేసేది. నవంబర్ 28న తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆమె కుటుంబం అమ్రోహాలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో మొరాదాబాద్లోని మరో ఆసుపత్రికి తరలించారు. మొరాదాబాద్లో టెస్ట్లు చేయగా, ఆమె పేగులు దెబ్బతిని ఆమె కడుపులో ద్రవం పేరుకుపోయిందని తేలింది. చికిత్స చేసి ఆమె కడుపు నుంచి దాదాపు ఏడు లీటర్ల ద్రవాన్ని తొలగించారు. అయినా ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందుతున్న సమయంలో అహానా మరణించింది. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
