జమ్మూకశ్మీర్లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సైన్యం సెర్చ్ ఆపరేషన్..
జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి మళ్లీ డ్రోన్ల కదలికలు భద్రతా దళాలను ఉలిక్కిపడేలా చేశాయి. రాజౌరి జిల్లాలోని కేరి సెక్టార్, దూంగా గాలి ప్రాంతాల్లో అర్థరాత్రి సమయంలో అనుమానాస్పద డ్రోన్లు సంచరించినట్లు నివేదికలు అందాయి. శత్రు దేశం నుండి వచ్చిన ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలను తరలించే అవకాశం ఉందన్న అనుమానంతో సైన్యం అప్రమత్తమైంది. సైన్యం సెర్చ్ ఆపరేషన్ డ్రోన్ల కదలికలను గమనించిన వెంటనే భారత సైన్యం అప్రమత్తమైంది. వాటిని కూల్చివేసేందుకు దళాలు…
