Andhra: వేట నిషేధం ముగిశాక.. తొలిసారి సముద్రంలోకి.. ఆ జాలర్ల పంట పండింది
సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్కు చెందిన మత్స్యకారులకు అరుదైన అదృష్టం కలిసి వచ్చింది. రెండు నెలల వేట నిషేధం ముగిసిన అనంతరం సముద్రంలోకి వేటకు వెళ్లిన వారి వలకు ఒకేసారి మూడు అరుదైన కచిడి చేపలు చిక్కాయి. ఈ ఘటన హార్బర్ పరిసరాల్లో ఆసక్తిని రేకెత్తించగా, మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరిసింది. సముద్రం నుంచి తీసుకొచ్చిన ఈ మూడు చేపలను హార్బర్లో బహిరంగ వేలం నిర్వహించగా, స్థానిక వ్యాపారి వాటిని మొత్తం రూ.1.50 లక్షలకు…
