పెట్రోల్, డీజిల్.. ప్రత్యేక పన్ను విధించిన కేంద్రం! ఇదైతే మన మంచికే..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సుంకాలు జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం.. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.4, డీజిల్పై రూ.8.50, విమాన ఇంధనం (ATF)పై లీటరుకు రూ.7.50 చొప్పున…
