స్మార్ట్ఫోన్ యుగంలో పెరుగుతున్న ‘నిశ్శబ్ద హంతకి’! ప్రాణాలు కాపాడుకోవడానికి నిపుణులు చెబుతున్న సలహాలు..
ఆధునిక సదుపాయాలు మనిషికి సౌకర్యాన్ని ఇస్తున్నాయి కానీ, మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నాయి. ఒకప్పుడు సమస్య వస్తే పది మందితో పంచుకునే వారు ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ, పక్కనున్న వారితో మాట్లాడటమే మరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే మనిషి ఒంటరిగా మారిపోతున్నాడు. తన సమస్యను ఎవరికీ చెప్పుకోలేక, లోపల ఉన్న బాధను పది మందికి తెలిస్తే నామోషీగా భావిస్తూ డిప్రెషన్ లోకి జారుకుంటున్నాడు. ఇది ఎంతటి స్థాయికి చేరుతోందంటే.. చివరకు ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారం…
