2. వినయ్ కుమార్ – 102 పరుగులు (ఎదురుగా ఆస్ట్రేలియా, 2013): బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చిరస్మరణీయ వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేయడంతో భారత్ 383 పరుగులు సాధించింది. అయితే, భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ బ్యాటర్లు కూడా అంతే దీటుగా బదులిచ్చారు. ముఖ్యంగా భారత పేసర్ వినయ్ కుమార్ బౌలింగ్ను టార్గెట్ చేస్తూ చెలరేగిపోయారు. కేవలం 9 ఓవర్లలోనే వినయ్ కుమార్ 102 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ తీశాడు. అప్పట్లో వన్డేల్లో ఇదే అత్యంత దారుణమైన భారత బౌలింగ్ రికార్డు.
