మరోవైపు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. బీ28 బుల్లెట్ రైలు అనేది స్వయం సమృద్ది గల వెర్షన్ అని, బీఈఎంఎల్, ఐసిఎఫ్ సంయుక్తంగా డిజైన్ చేశాయన్నారు. బీఈఎంఎల్లోనే దీని తయారీ జరుగుతుందని, బుల్లెట్ రైళ్ల తయారీ కోసమే ప్రత్యేకంగా ఆదిత్య కాంప్లెక్స్ రూపొందించామన్నారు. ఇక్కడ అత్యాధునిక యంత్రాలు ఉంటాయని, అవి అత్యంత ఖచ్చితత్వంతో పని చేస్తాయన్నారు. దీనికి అనుగుణంగానే ఇక్కడ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.
