Andhra Pradesh: చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తోటలో కనిపించిన రెండు బొమ్మలు.. అసలు కథ ఏంటంటే..?
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక ప్రాంతంలో గత 11 రోజులుగా అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి జాహ్నవి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. తాజాగా పాప తప్పిపోయిన ప్రాంతంలో రెండు బొమ్మలు ప్రత్యక్షమవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జాహ్నవి అదృశ్యమైన పామాయిల్ తోటలోని పొలం కంచెకు ఈ రెండు బొమ్మలను వేలాడదీసినట్లు గుర్తించారు. అయితే దీనిపై తుని రూరల్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కేస్ సీన్…
