
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో హనుమకొండకు చేరుకున్నారు. హనుమాన్నగర్లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు నిరంజన్ను పరామర్శిస్తున్నారు.. ఒక్కసారి చూడాలని ఉందన్న ఆ బాలుడి కోరిక తీర్చేందుకు పవన్ కల్యాణ్ స్వయంగా కదిలి అక్కడికి చేరుకుని.. నిరంజన్ తో మాట్లాడుతున్నారు.. పవన్ కల్యాణ్ను చూడడమే అతనికి అరుదైన ఔషధంగా బావిస్తున్న ఆ కుటుంబం పవన్ కల్యాణ్ రాక కోసం ఎదురుచూసింది. దాదాపు 45 నిమిషాల పాటు ఆ బాలుడితో పవన్ కల్యాణ్ ఉంటారు. పవన్ కళ్యాణ్ పర్యటన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన రాము – మానస దంపతుల కుమారుడు నిరంజన్.. జన్యుపరమైన అరుదైన నరాల వ్యాధితో మంచానికి పరిమితమైయ్యాడు. ఆ బాలుడి కోరిక తీర్చేందుకు పవన్ కల్యాణ్ హనుమకొండకు చేరుకుని.. మాట్లాడుతున్నారు.
