Dharmendra Pradhan: నకిలీ సోషల్ మీడియా అకౌంట్స్పై ఉక్కుపాదం.. నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
రాబోయే నీట్ (UG) పునఃపరీక్షను అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది.. దీనిలో భాగంగా మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కేంద్ర భద్రతా, నిఘా (ఇంటెలిజెన్స్) ఏజెన్సీల ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అత్యున్నత స్థాయి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పరీక్షను సురక్షితంగా, పటిష్టంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అప్రమత్తతను పెంచాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ధర్మంద్ర ప్రధాన్…
