కొత్తగా అకౌంట్ తెరవాలంటే రూ.200 కట్టాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి..
నేషనల్ పెన్షన్ సిస్టమ్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలను తీసుకురానుంది. అంతేకాకుండా ఈ పథకంలో చేరేవారి నుంచి ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఒక్కో పీఆర్ఏన్పై రూ.200 వన్ టైమ్ ఛార్జీ వసూలు చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈకొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రూ.200 రుసుంను ఒకేసారి వసూలు చేయరు. ప్రతీ త్రైమాసికానికి రూ.50 చొప్పున…
