Kavitha: కోర్టు చెప్పింది సత్యం..నేను కడిగిన ముత్యం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసిందని, న్యాయం గెలిచిందని ఆమె పేర్కొన్నారు. “కోర్టు చెప్పింది సత్యం. నేను కడిగిన ముత్యం” అని కవిత వ్యాఖ్యానించారు. ఈ కేసు రాజకీయ దురుద్దేశంతో పెట్టిందేనని, ఇప్పుడు అది తేలిపోయిందని ఆమె అన్నారు. తన కుటుంబ సభ్యులకు, జాగృతి, తెలంగాణ కుటుంబాలకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని…
