నేపాల్లో చిక్కుకున్న ఏపీ భక్తుల తరలింపునకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యాత్రికులు పలువురు చిక్కుకుపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ఘటనపై స్పందించి యాత్రికులపై రక్షణ చర్యలపై హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆర్టీజిఎస్ -విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు నేపాల్లోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ యాత్రికుల భద్రతను పర్యవేక్షిస్తున్న తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. బాధితుల…
