IND vs NAM : నమీబియాతో భారత్ ఢీ.. ఢిల్లీ గడ్డపై పరుగుల వర్షం కురిపించే మొనగాళ్లు వీరే
IND vs NAM : టీ20 వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన జైత్రయాత్రను కొనసాగించేందుకు సిద్ధమైంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పసికూన నమీబియాతో టీమిండియా తలపడనుంది. తొలి మ్యాచ్లో అమెరికాపై చెమటోడ్చి గెలిచిన భారత్, ఇప్పుడు నమీబియాను చిత్తు చేసి సెమీస్ దిశగా అడుగులు వేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లలోని కీలక ఆటగాళ్లపై అందరి దృష్టి నెలకొంది. మ్యాచ్లో ప్రభావితం చేయగల టాప్-5 ప్లేయర్ల గురించి తెలుసుకుందాం….
