Tirumala: భక్తికి నిలువెత్తు నిదర్శనం.. 30 ఏళ్లలో ఈ భక్తుడు ఎన్ని సార్లు తిరుమల కొండెక్కాడంటే..
ఆపదమొక్కులవాడికి భక్తులు చెల్లించే మొక్కులు ఒక్కొక్కరివి ఒక్కో తీరు. ముడుపులు కట్టి, వడ్డి కాసులవాడికి మొక్కులు తీర్చుకోవడానికి రోజుకు వేల సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారు. అదివో అల్లదిగో అంటూ ఏడుకొండలవాడి దర్శనం కోసం కొండ మెట్లు ఎక్కే భక్తులు, అడుగడుగునా దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటారు. ఇలా అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల ద్వారా గోవింద నామస్మరణతో తిరుమల యాత్ర చేసే భక్తులలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక భక్తుడు ప్రత్యేకంగా నిలుస్తున్నారు….
