ఇడ్లీల తయారీ మరియు స్పెషల్ చట్నీ ఉదయాన్నే పులిసిన పిండిలో తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి, ఈ పిండిని వేసి పాత్రలో ఉంచి 10 నుండి 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఈ లోపు దీనికి కాంబినేషన్గా అదిరిపోయే టమాటో-పల్లీ చట్నీ తయారు చేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాసు వేరుశనగ గుళ్లను వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో ఐదు టమాటాలు, మూడు ఎండుమిర్చి, అర టీస్పూన్ జీలకర్ర వేసి నీళ్లలో మెత్తగా ఉడికించాలి. వీటన్నింటినీ మిక్సీలో వేసి ఉప్పుతో పాటు గ్రైండ్ చేసి, పోపు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన పల్చటి చట్నీ సిద్ధమవుతుంది.
